హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో చెలరేగిన అల్లర్లలో విద్యాసాగర్ విగ్రహం ధ్వంసమైన విషయం తెలిసిందే. అమిత్ షా ర్యాలీని అడ్డుకోవడానికి జరిగిన ఘర్షణలో ఆ విగ్రహం ధ్వంసమైంది. అయితే తాము అధికారంలోకి వస్తే విద్యాసాగర్ పంచలోహ విగ్రహాన్ని చేయిస్తామని ప్రధాని మోదీ ఆ తర్వాత ఓ ర్యాలీలో హామీ ఇచ్చారు. కానీ తమకు పంచలోహ విగ్రహాలు ఏమీ అవసరం లేదని దీదీ కూడా అన్నారు. అయితే ఇవాళ బెంగాల్ భాషా పండితుడు విద్యాసాగర్ విగ్రహాన్ని కాలేజీలో మమతా బెనర్జీ ప్రతిష్టించారు. ఆ తర్వాత కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతి రాష్ట్రానికి వారసత్వం, భాష ఉంటాయని, ఇది మన దేశమని, కానీ బీజేపీ మన రాష్ట్ర తలరాతను మార్చలేదన్నారు. బెంగాల్ సంస్కృతిని ధ్వంసం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.