తన కాన్వాయ్ వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించడంతో అధికారులు ప్రత్యమ్నాయ మర్గాలు అన్వేషిస్తున్నారు. ఇందులో భాంగంగా సీఎం క్యాంపు కార్యాలయానికి దగ్గర్లో హెలిప్యాడ్ నిర్మించాలని నిర్ణయించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్తున్నప్పుడు తన కాన్వాయ్ వ్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తన ప్రయాణాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని జగన్ ఇటీవల ఆదేశించారు.