తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితులను అమిత్షాకు వివరించానని గవర్నర్ నరసింహన్ అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో భేటీ అనంతరం గవర్నర్ నరసింహన్ మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా ముందుకు సాగుతున్నాయన్నారు. పెండింగ్లో ఉన్న భవనాల సమస్యను పరిష్కరించామన్నారు. విభజన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు.