ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, నాదెండ్ల మనోహర్ జనసేనకు రాజీనామా చేసి బీజేపీలో చేరనున్నారన్న వార్తలు సామాజిక మీడియాలో పంరపరగా వస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం గుంటూరు జిల్లాలో ఓటమికి కారణాలను అన్వేషిస్తూ, పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించగా, దానికి నాదెండ్ల హాజరుకాకపోవడమే. అయితే వ్యక్తిగత కారణాలతోనే ఆయన సమీక్షా సమావేశానికి రాలేదని కొందరంటే, మనోహర్ పార్టీ మార్పుపై జనసేన ధీటుగా స్పందించింది. అమెరికా పర్యటనలో ఉన్న కారణంగానే నాదెండ్ల సమీక్షా సమావేశానికి హాజరు కాలేదని స్పష్టం చేసింది. ఆయన పార్టీని వీడబోరని, కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించింది. గత ఎన్నికలకు ముందు జనసేనలో చేరి, గత ఎన్నికల్లో తెనాలి నుంచి బరిలోకి దిగి ఓడిపోయిన విషయం విదితమే.