తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ముస్లింల సంక్షేమానికి ఎంతో కృషి చేశామని, అధికా రంలోఉన్నా లేకపోయినా వారి కి అండగా ఉంటామని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ ఆధ్యర్యంలో సోమవారం విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశామని, ఈకార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొంటారని తెలిపారు. ఆదివారం ఏ1 కన్వెన్షన్ సెంట ర్లో ఇఫ్తార్ విందు ఏర్పాట్లను ఆయనతోపాటు టీడీపీ సీనియర్ నేతలు పరిశీలిం చారు. ఈసందర్భంగా దేవినేని ఉమమహేశ్వరరావు మాట్లాడుతూ ముస్లింల ను అన్ని విధాలా ఆదుకుంది టీడీపీయేనని, టీడీపీ అన్ని మతాలను గౌరవిస్తుం దని స్పష్టంచేశారు. టీడీపీ అధికారంలో ఉన్నా లేకున్నా ముస్లింలకు రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనవాయితీ అని టీడీపీ నేత నాగుల్ మీరా తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ నేతలు బ చ్చుల అర్జునుడు, జలీల్ ఖాన్, దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు.