తమిళనాడులోని ఈరోడ్లో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను నరికి చంపేశాడు భర్త. కర్ణాటకకు చెందిన మునియప్పన్(28), నివేత(19)కు ఎనిమిది నెలల క్రితం పెళ్లి అయింది. వీరిద్దరూ ఈరోడ్కు 10 కిలోమీటర్ల దూరంలోని మెట్టుకైడ్డెలో నివాసముంటున్నారు. అయితే మునియప్పన్ వివాహం అయిన కొద్ది రోజుల నుంచి భార్యను అనుమానించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంది. సోమవారం రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అనంతరం భార్యను కత్తితో నరికి చంపేశాడు. మొండెం నుంచి తలను వేరు చేసిన మునియప్పన్.. ఓ సంచిలో కుక్కాడు. బైక్పై మృతదేహాన్ని తీసుకెళ్తుండగా.. సంచిలో నుంచి నివేత కాళ్లు బయటకు వచ్చాయి. దీన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించి మునియప్పన్ను అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని మునియప్పన్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.