విజయవాడ నగరంలోని సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగింది. ఈ విషయం ఏపిలో తీవ్ర స్థాయిలో కలకలం రేపుతోంది. దొంగతనం కేసులో ఓ వ్యక్తిని సింగ్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి నిజం రాబట్టేందుకు పోలీసులు తమదైన శైలిలో విచారించినట్టు తెలుస్తోంది. పోలీసుల ఇంటరాగేషన్లో నిందితుడు సృహ కోల్పొయినట్టు సమాచారం. దీంతో పోలీసులు నిందితుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నిందితుడు మృతిచెందడంతో దీంతో గుట్టుచప్పడు కాకుండా, మీడియాకు తెలియకుండా ఈ తతంగాన్ని పూర్తి కానిచ్చేందుకు పోలీసులు ప్రయత్నించినట్టు వార్తలందుతున్నాయి. ఓ దొంగతనం కేసులో పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు హఠాత్తుగా మరణించడంపై పలు అనుమానాలకు తావిస్తోందని, ఇది ఖచ్చితంగా లాకప్ డెత్ అని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.