దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఓ వ్యక్తి చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా అక్కడివారంతా ఉలిక్కిపడ్డారు. శుక్రవారం ఉదయం కోర్టు కార్యకలాపాలు సాగుతుండగా ఓ వ్యక్తి లోపలికి వచ్చాడు. అందరూ చూస్తుండగానే ఎడమచేతిని కోసుకున్నాడు. వెంటనే అక్కడున్న సిబ్బంది అతడిని రక్షించారు. రక్తస్రావం అవుతున్న చేతికి రుమాలు చుట్టి ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే ఆ వ్యక్తి ఎవరు.. ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడనే వివరాలు మాత్రం తెలియరాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.