వైసీసీ తరుఫున విజయవాడలో పార్లమెంట్ స్ధానానికి పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ ఒక ఎంపీ, రెండు మీడియా సంస్ధలు తనపై అసత్య ఆరోపణలు చేశాయని సోమవారం ఒక్కొక్కరిపై 100 కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేయబోతున్నానని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా "తాను కోల్గెట్ స్కామ్ లో ఉన్నానని, స్కామ్ స్టర్, బ్లాక్ మెయిలర్ అని చంద్రబాబు అన్నారన్నారు.. ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అన్నారు..ఇకనుండి చట్టపరంగా వెళ్లతానని,ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు. వాళ్ల కొవ్వు కరిగేంతవరకు కోర్టులు చుట్టు తిప్పుతాను" అని పీవీపీ తేల్చి చెప్పారు.