ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటేయలేదో శపిస్తా... సాక్షి మహరాజ్‌

national |  Suryaa Desk  | Published : Sat, Apr 13, 2019, 08:00 PM

యూపీలోని ఉన్నావ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో సాక్షి మహరాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వివాదాలకు కేరాఫ్‌గా మారిన బిజెపి లోక్‌సభ సభ్యుడు సాక్షి మహరాజ్‌ మరోసారి తన నోటికి పనిచెప్పారు. ఈసారి ఏకంగా ఓటర్లపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో తనకు ఓటేయకుంటే అందరిని శపిస్తానని ఆయన హెచ్చరించారు. తాను ఓ సన్యాసిననీ, తాను అడిగింది ఇవ్వకపోతే చెడు కలుగుతుందని పురాణాల్లో ఉందని వ్యాఖ్యానించారు. తాను ఆస్తులు అడగటం లేదనీ, దేశంలోని 125 కోట్ల మంది భవిష్యత్తును నిర్దేశించే ఓటును మాత్రమే అడుగుతున్నానని అన్నారు. . 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉన్నావ్ నుంచి సాక్షి మహరాజ్ ఘనవిజయం సాధించారు. 2019లో మోదీ నెగ్గితే 2024లో ఎన్నికలే ఉండవని సాక్షి మహరాజ్ ఇటీవల వ్యాఖ్యానించా రు. దీనిపై పెద్దఎత్తున దుమారం చెలరేగింది. కాగా, ఈ వ్యాఖ్యలపై బీజేపీ వర్గాలు ఇంతవరకూ స్పందించలేదు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com