ఏపీ ఎన్నికల్లో ఈసీ ఏకపక్షంగా వ్యవహరించిందని మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన తన నివాసంలో మీడియాలో మాట్లాడుతూ తెదేపాకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఈవీఎంలు పని చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. శుక్రవారం కడప జిల్లాలోని పోట్లదుర్తిలో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 125 అసెంబ్లీ స్థానాల్లో తెదేపా విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్కు పదవీ వ్యామోహం ఎక్కువైన కారణంగానే రాష్ట్ర ప్రజలు తెదేపా వైపు మొగ్గు చూపారని అభిప్రాయపడ్డారు. ప్రజా తీర్పు పూర్తి స్థాయిలో తెదేపాకే అనుకూలంగా ఉందని మంత్రి ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.