ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తర ప్రదేశ్ లో ప్రియాంక గాంధీ రోడ్ షో లో హంగామా

national |  Suryaa Desk  | Published : Wed, Apr 10, 2019, 02:56 AM

ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసారు లోక్ సభ ఎన్నికల తొలి విడతలో ఎన్నికలు జరగనున్న బిజ్నోర్, షహరాన్పూర్ లాలో ప్రియాంకా గాంధీ గురువారం రోడ్ షో లు నిర్వహించారు. ప్రియాంక గాంధీ రోడ్ షో కు భారీగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు హాజరవడం తో కాంగ్రెస్ వర్గాల్లో కొంత మేరకు ఉత్సాహం పెరిగింది. అయితే బిజ్నోర్ రోడ్ షో లో కొద్దీ సేపు హంగామా జరిగింది.వాస్తవానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా లతో కలిసి సంయక్తంగా ప్రియాంకా గాంధీ సోమవారం బిజ్నోర్, షహరాన్పూర్ , కై రానా లలో రోడ్ షో లు నిర్వహించాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించక పోవడం తో రోడ్ షో లు, ర్యాలీ లు రద్దయ్యాయి. దాంతో ప్రియాంక గాంధీ మంగళవారం పలు రోడ్ షో లలో పాల్గొన్నారు.ముందుగా ప్రియాంక గాంధీ మంగళవారం బిజ్నోర్ కు చేరుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు నసీముద్దీన్ సిద్దికీ,ఓంవతి ప్రియాంక గాంధీ తో పాటు రాడ్ లో పాల్గొన్నారు. బీఎస్పీ నేత మాయావతి కి అత్యంత సన్నిహితుడిగా పేరున్న  నసీరుద్దీన్ ఇటీవలే బీఎస్పీ నుంచి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. పెద్ద ఎత్తున రోడ్  షో లో పాల్గొన్న కార్యకర్తలుచౌకీదార్ చోర్ హై , యిక కాంగ్రెస్ వస్తేనే న్యాయం జరుగుతుందని నినాదాలు చేసారు. అయితే రమ్ముఖా చౌరస్తా వద్ద కొద్దీ మంది బీజేపీ కార్యకర్తలు రోడ్ షో వద్దకు వచ్చి మోడీ, మోడీ అంటూ నినాదాలు చేయడం
తో కొద్దీ సేపు హంగామా జరిగింది. బీజేపీ కార్యకర్తల వైపు చూసిన ప్రియాంక గాంధీ చేతిలో ఉన్న పూలను వారిపైకి విసిరి చిరు నవ్వులు చిందించడం తో
బీజేపీ కార్యకర్తలు కొంత వెనక్కి తగ్గారు. అయితే పోలీసులు జోక్యం చేసుకొని బీజేపీ కార్యకర్తలను అక్కడినుంచి పంపించి వేశారు. రాడ్ షో కు
మహిళలు అధిక సంఖ్యా లో రావడం తో ప్రియాంక గాంధీ వాహనం నుంచి దిగి వారితో మాట్లాడుతూ రోడ్ షో కొనసాగించారు. బిజ్నోర్ నుంచి హహరాన్పూర్ చేరుకున్న ప్రియాంక కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ తో కలిసి రోడ్ షో లో పాల్గొన్నారు. రోడ్ షో కు భారీగా ప్రజలు తరలి రావడం తో వాహనం నుంచి దిగి వారితో కలిసి నడుస్తూ రోడ్ షో ను పాదయాత్ర గా ప్రియాంక గాంధీ మార్చేశారు.








SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com