ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ అఫిడవిట్ లో చెప్పని ఆస్తుల విలువ రూ.4862కోట్లు : కుటుంబరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 09, 2019, 03:38 PM

జగన్ తన ఆస్తులన్నీ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనలేదని, జగన్ అఫిడవిట్ లో చెప్పని ఆస్తుల విలువ రూ.4862కోట్లు ఉందని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ…. జగన్ వాస్తవాలు దాచిపెట్టి ప్రజలను మాయ చేసేందుకు ప్రయత్నించారన్నారు. పొట్లూరి వరప్రసాద్ కంపెనీలో షేర్లు పెట్టిన వాళ్లు నష్టపోయారన్నారు. ఆర్థిక నేరగాళ్లను కాపాడేందుకు విజయసాయిరెడ్డి ఉన్నారని జగన్ చెబుతున్నారన్నారు. జగన్ ఆస్తులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశముందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com