బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసేది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే నని మంత్రి అచ్చెన్నాయుడు అ న్నారు సోమవారం అయన టెక్కలిలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ . బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చింది, తీసుకొచ్చేది, తీసుకురాబోయేది తెలుగుదేశం పార్టీనే అని స్పష్టం చేసారు. బడుగు, బలహీన వర్గాలకు ఇళ్లు, పింఛన్లు, రైతు రుణమాఫీ, పసుపు-కుంకుమ వంటి సంక్షేమ పథకాలతో పాటు ఆదరణ వంటి పథకాల ద్వారా వారి అభివృద్ధికి బాటలు వేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని ఆ ప్రభుత్వసారధి చంద్రబాబునాయుడు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. గత ఐదేళ్లలో బడుగులకు అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అధికారంలోకి రావలసిన అవసరం ఉంది. . ఇప్పటికే రాజకీయంగా బీసీలకు అన్యాయం చేసిన జగన్.. సంక్షేమ రంగంలో కూడా అణచివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు సంక్షేమం సాధికారత సాధ్యం కావాలంటే చంద్రబాబు నాయుడి గెలుపు, తెలుగుదేశం గెలుపు చారిత్రక అవసరం. 150+ అనే చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం. బీసీల ఐక్యతను చాటుకుందాం అని పిలుపునిచ్చారు అచ్చెన్న