ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బడుగులకు అండ టీడీపీ ఒక్కటే : అచ్చెన్నాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 08, 2019, 11:12 PM
 బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసేది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే నని మంత్రి అచ్చెన్నాయుడు అ న్నారు సోమవారం అయన టెక్కలిలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ . బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చింది, తీసుకొచ్చేది, తీసుకురాబోయేది తెలుగుదేశం పార్టీనే అని స్పష్టం చేసారు. బడుగు, బలహీన వర్గాలకు ఇళ్లు, పింఛన్లు, రైతు రుణమాఫీ, పసుపు-కుంకుమ వంటి సంక్షేమ పథకాలతో పాటు ఆదరణ వంటి పథకాల ద్వారా వారి అభివృద్ధికి  బాటలు వేసింది  తెలుగుదేశం ప్రభుత్వం అని ఆ ప్రభుత్వసారధి   చంద్రబాబునాయుడు   రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్నారు.  గత ఐదేళ్లలో బడుగులకు అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అధికారంలోకి రావలసిన అవసరం ఉంది. . ఇప్పటికే రాజకీయంగా బీసీలకు అన్యాయం చేసిన జగన్.. సంక్షేమ రంగంలో కూడా అణచివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు సంక్షేమం సాధికారత సాధ్యం కావాలంటే చంద్రబాబు నాయుడి గెలుపు, తెలుగుదేశం గెలుపు చారిత్రక అవసరం. 150+ అనే చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం. బీసీల ఐక్యతను చాటుకుందాం అని పిలుపునిచ్చారు అచ్చెన్న 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com