పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్ దీదీ అని మోదీ అన్నారు. బెంగాల్లోని సిలిగురిలో ఇవాళ మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీదీ పాలనలో చిట్ఫండ్ కేసులు ఎక్కువైనట్లు మోదీ ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి కోసం మమతా మరింత పనిచేయాల్సి అవసరం ఉందన్నారు. బెంగాల్లో ఓ స్పీడ్బ్రేకర్ ఉందని, ఆ స్పీడ్బ్రేకర్ను దీదీ అంటారని, మీ అభివృద్ధికి ఈ స్పీడ్బ్రేకరే అవరోధంగా మారిందని మోదీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ నుంచి కూడా బెంగాల్ తప్పుకోవడాన్ని మోదీ తప్పుపట్టారు. ఆయుష్మాన్ భారత్కు దీదీ బ్రేకేశారని మోదీ అన్నారు.