కాంగ్రెస్ నాయకులలాగే వారి మేనిఫెస్టో కూడా అవినీతి, అక్రమాలకు, అబద్ధాలకు నిలయంగా నిలిచిందని ప్రధాని మోడీ విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్లోని పసిఘాట్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడారు. కాంగ్రెస్ విడుదల చేసింది మేనిఫెస్టో కాదని, అదొక హిపోక్రసీ డాక్యుమెంటని మోడీ అన్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఓటు బ్యాంకు కోసం పని చేస్తారని, దేశం ఏమై పోతున్నా పట్టించుకోరని ఆయన అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆయన అన్నారు. బిజెపి పట్ల మీరు చూపిన విశ్వాసం కారణంగా ఈశాన్య భారత్లో అనేక ప్రాజెక్టులను అమలు చేశామని ఆయన అన్నారు.