70 ఏళ్ళు దాటినా వాళ్లు ఎన్నికల్లో పాల్గొనాల వద్ద ఆంశం పై బీజేపీ హై కమాండ్ ఏ నిర్ణయం తీసుకోకపోయినా.ఈ సారి లోక్ సభ ఎన్నికలకు మాత్రం వయసు మీరిన అగ్రనేతలను పక్కన పెట్టిన బీజేపీ.ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ,బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఓ ప్లాన్ ప్రకారం పార్టీలో తలపండిన సీనియర్లను ఎన్నికల్లో బరిలో నిలవకుండా చేస్తున్నారు.మాజీ ఉప ప్రధాని ఎల్.కే అద్వానీ గుజరాత్ లోని గాంధీ నగర్ లోక్ సభ నియోజవర్గం పోటీ చేయకుండా అడ్డుకున్న బీజేపీ అగ్రదళం.ఇప్పుడు పార్టీ మాజీ అధ్యక్షుడు లోకసభ సభ్యుడు మురళీమనోహర్ జోషికి కూడా షాక్ ఇచ్చింది. బీజేపీ అధిష్టానం నిర్ణయం తో కనీసం 25 మంది సీనియర్ల నాయకులకు టికెట్లివ్వని బీజేపీ.పార్టీకి చెందిన సీనియర్ నాయకుల స్థానం లో యవనేతలను ఎన్నికల బరిలోకి దించాలని కమలదళం నిర్ణయం తీసుకుంది