న్యూఢిల్లీ: ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితికి వచ్చి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్వేస్ సంస్థ శనివారంనాటి నుంచి కొన్ని అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకలను నిలిపివేసింది. ఏప్రిల్ వరకు రద్దు చేసిన విమానాలు రాకపోకలు సాగించవు. విమానాల అద్దె చెల్లించలేకే సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ, ముంబయి నగరాల నుంచి అబుదాబీ, దమ్మమ్, ఢాకా, హాంకాంగ్, రియాద్ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. గతంలో రోజుకు 600 విమానాలను నడిపేవారమని, నేడు 119 విమాన సర్వీసులను మాత్రమే నడుపుతున్నామని జెట్ ఎయిర్వేస్ వెల్లడించింది.