వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి గన్నవరం ఎయిర్పోర్టు నుంచి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు బయల్దేరి వెళ్లారు. ఏలూరులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న బీసీ గర్జన సభలోజగన్ పాల్గొని ప్రసంగించనున్నారు. బహిరంగసభలో బీసీ డిక్లరేషన్ను జగన్ ప్రకటించనున్నారు. సభకు హాజరయ్యేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివస్తున్నారు.