కొత్త రాష్ట్ర నిర్మాణాన్ని అడ్డుకునేందుకు బిజెపి, టిఆర్ఎస్, వైసిపి పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఏపి మంత్రి యనమల ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాలో మాట్లాడుతూ పేదల సంక్షేమాన్ని అడ్డుకునే కుతంత్రాలు. 5ఏళ్లలో తెలంగాణ కన్నా ఏపి అభివృద్ధి చెందిందనే ఈర్ష్య టిఆర్ఎస్ది. నమ్మకద్రోహంపై తిరగబడ్డామనే ఆక్రోశం నరేంద్రమోదిది. పదవీకాంక్ష, కేసులమాఫీ కోసం జగన్మోహన్ రెడ్డి బిజెపి, టిఆర్ఎస్ పార్టీలతో కలిసి కుట్రలు చేస్తున్నారు. ముగ్గురూ కుమ్మక్కై ఏపికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రల కూటమిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజలే చూసుకుంటారని వ్యాఖ్యానించారు. కుట్రకూటమి గెలిస్తే బిసిల సంక్షేమం, పేదల సంక్షేమం ఆగిపోతుంది. రాష్ట్ర అభివృద్ది కుంటుపడుతుందని, రాజధాని,పోలవరం నిర్మాణం ఆగిపోతుందని . 13జిల్లాల పారిశ్రామికాభివృద్ది పడకేస్తుందని హెచ్చరించారు. హోదా ఇవ్వనన్న బిజెపితో వైసిపి అంటకాగుతోంది, హోదాకు అడ్డంపడిన టిఆర్ఎస్ తో వైసిపి చేతులు కలిపింది. కుట్రల కూటమికి ప్రజలే గుణపాఠం చెప్పాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు యనమల
వైసిపి డబ్బుసంచుల పంపిణీకి బిజెపి, టిఆర్ఎస్ సహకారం ఉందన్నది నిజమేనని. అసెంబ్లీకి హాజరుకాని వారికి ఎందుకు ఓట్లు వేయాలి..? పార్లమెంటుకు వెళ్లనివాళ్లకు ఎందుకు ఓటేయాలి..? చట్టసభలకు హాజరుకాని మీకెందుకు ఓట్లు..? అంటూ ఘాటుగా విమర్శించారు.