వైసీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. ఆళ్లగడ్డలో టీడీపీ సీనియర్ నేతలు ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు నేడు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇరిగెల కుటుంబం సుదీర్ఘకాలంగా టీడీపీలోనే ఉంది. ఆళ్లగడ్డలో పట్టున్న కుటుంబం. ఇరిగెల రాంపుల్లారెడ్డి గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా మంత్రి అఖిలప్రియ వ్యవహార శైలిపై ఇరిగెల కుటుంబం అసంతృప్తితో ఉంది. పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో ఇరిగెల కుటుంబం వైసీపీలో వెళ్లేందుకు రెడీ అయిపోయారు. ఆళ్లగడ్డలో ఇరిగెల కుటుంబం పార్టీని వీడితే టీడీపీకి దెబ్బే. ఈరోజు లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో ఇరిగెల సోదరులు వైసీపీ కండువాను కప్పుకోనున్నారు.