తిరుమల: తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణం ఉంది. శ్రీనివాసుడి సర్వదర్శనానికి భక్తులు ఆరు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 12 గంటల సమయం, టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని నిన్న 65,987 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,840 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2.59 కోట్లుగా ఉంది.