ఢిల్లీ : రాఫెల్ డీల్పై కాగ్ నివేదిక పార్లమెంటు ముందుకు వచ్చింది. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంపై కాగ్ ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. యూపీఏ హయాం డీల్ కంటే 2.86 శాతం తక్కువకే డీల్ కుదిరినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది. తొలుత దేశానికి వచ్చే 36 యుద్ధ విమానాలు 9 శాతం తక్కువ ధరకు వచ్చాయని కాగ్ పేర్కొంది. 126 రాఫెల్ జెట్ డీల్తో పోలిస్తే 17.08 శాతం డబ్బు ఆదా అయ్యిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. 9 శాతం తక్కువ ధరకు డీల్ చేశామని గతంలో ఎన్డీయే పేర్కొంది.