ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చి 31వరకు టీవీ చానళ్ల ఎంపిక‌కు పొడిగింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 13, 2019, 02:45 AM

ట్రాయ్ ప్రవేశపెట్టిన కొత్త విధివిధానాలు దేశంలో పెద్ద దూమారం రేపింది. వినియోగదారుడు వీక్షించే ఛానెళ్లకు మాత్రమే డబ్బులు చెల్లించేలా ట్రాయ్ తీసుకొచ్చిన ‘పే ఛానెల్‌’కి డబ్బు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించడంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నచ్చిన ఛానెళ్లను ఎలా ఎంపిక చేసుకోవాలో తెలియక చాలా మంది పే ఛానెళ్ల ఎంపిక చేసుకోలేదు. దీంతో చాలా చోట్ల పే ఛానెల్స్ ప్రసారాలు కూడా నిలిచిపోయాయి. దీనిపై ప్రజలకు ఎలాంటి అవగాహన లేకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ట్రాయ్… సామాన్య ప్రజలకు ఊరట కల్పించింది. ‘పే ఛానెళ్ల ఎంపిక’ గడువును మార్చి 31 వరకు పొడిగిచింది. మార్చి 31వరకు కూడా ఛానెళ్ల ఎంపిక చేసుకోకుంటే.. ఆటోమేటిగ్గా ‘బెస్ట్ ఫిట్ ప్లాన్’ లోకి మారిపోతారు. అయితే భాష, ఛానెల్ పాపులారిటీ, ప్రేక్షకుల వినియోగాన్ని బట్టి ‘బెస్ట్ ఫిట్ ప్లాన్’ ను రూపొందింస్తారు. దీన్ని ప్రస్తుతం ఉన్న టారిఫ్ ప్లాన్ రేటును మించకూడదని ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం 100 ఎస్‌డీ ఛానెళ్ల బేస్ ప్యాక్ రూ.130. దానికి జీఎస్‌టీ అదనం. జీఎస్టీతో కలిపి కేవలం రూ.153 చెల్లించి 100 ఉచిత ఛానెళ్లు చూడొచ్చు. మొత్తం 535 ఫ్రీ టూ ఎయిర్ ఛానెళ్లలో మనకు నచ్చినవి 100 ఎంపిక చేసుకోవచ్చు. ఇక పే ఛానెల్స్ చూడాలంటే మాత్రం అదనంగా చెల్లించాల్సిందే. ఇందుకోసం ఆయా ఛానెళ్లు సూచించిన ప్యాకేజీలు తీసుకోవాలి. 330 పే ఛానెల్స్‌లో ఏది కావాలంటే అది ఎంపిక చేసుకొని దానికి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. Telu






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com