ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న బీవీ జయనాగేశ్వరరెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 09:28 PM

కూటమి ప్రభుత్వ పాలనలో పథకాలతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం కర్నూలు జిల్లా, గోనెగండ్ల, మండలంలోని పెద్దనేలటూరు, గుల్లమొరుసు గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. పెద్దనేలటూరు గ్రామంలో జలజీవన మిషన కింద రూ.96.8 లక్షలతో నిర్మించే నీటి ట్యాంక్‌కు భూమిపూజ చేశారు. రూ.20 లక్షలతో ఏర్పాటు చేసే సీసీ రోడ్డుకు, గోకులం షెడ్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు.


అలాగే గుల్లమొరుసు గ్రామంలో రూ.40లక్షలతో పెద్దమి రివీడు, చిన్నమరివీడు గ్రామాల అప్రొచ రోడ్డు కు కూడా భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో మణిమంజరి, టీడీపీ నాయకులు నజీర్‌, తిరుపతయ్యనాయుడు, మాజీ సర్పంచ వీరన్న, బసరాజుస్వామి, శేషప్పనాయుడు, శిల్పి శ్రీనివాసులు, రాముడు, రామాంజినేయులు, గోపాల్‌, సోమన్న, నారాయణ, రాజశేఖర్‌, చిన్ననేలటూరు నాగన్న, హరికృష్ణ, దానమయ్య, ఎర్రన్న టీడీపీ నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com