విజయనగరం జిల్లాలో డయేరియాతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, వారం రోజుల్లో 11 మంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వ్యాధిపై దండగ మాటలు మాట్లాడుతోందని మాజీ డిప్యూటీ సీఎం పి.రాజన్నదొర ఆక్షేపించారు. డయేరియా వ్యాధి వ్యాప్తిని ఒప్పుకోని ప్రభుత్వం, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులతో జనం మరణిస్తున్నారని వక్రభాష్యం చెబుతోందని వారు దుయ్యబట్టారు.
డయేరియా వ్యాధిగ్రస్తులను వైద్య ఆరోగ్య మంత్రి కనీసం పరామర్శించలేదన్న వారు, స్థానిక ఎమ్మెల్యే కూడా ఆచూకీ లేకుండా పోయారని తెలిపారు. తన సొంత నియోజకవర్గం సాలూరు పరిధిలోని పాచిపెంట మండలం, విశ్వనాథపురంలో ఈనెల 3న డయేరియా ఇప్పుడు మొత్తం జిల్లాను వణికిస్తోందని మాజీ డిప్యూటీ సీఎం పి.రాజన్నదొర తెలిపారు. ఇంత జరుగుతున్నా కనీసం బయో టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా? అని నిలదీసిన ఆయన, గవర్నమెంట్ స్కూళ్లలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్ల్లో రోగులు బెంచీల మీద పడుకోలేక, ఇళ్ల నుంచి మంచాలు తెచ్చుకునే దౌర్భాగ్యస్థితి నెలకొందని ఆవేదన చెందారు.