ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరస దొంగతనాలతో హడలిపోతున్న ఒంగోలు నగరవాసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 05:16 PM

ఒంగోలు నగర శివారు ప్రాంతంలో దొంగ లు హల్‌చల్‌ చేశారు. బుధవారం రాత్రి ఏకంగా నాలుగు ప్రాంతాలలో చోరీలకు పాల్ప డ్డారు. స్థానిక దక్షణ బైపాస్‌రో డ్డులో మూడు ప్రాంతాలతో పాటుగా పేర్నమిట్టలోని ఇంది రకాలనీలో ఓ ఇంట్లో దొంగలు తమ చేతివాటం చూపారు. భారీగా వర్షాల కారణంగా జనసంచారం తక్కువగా ఉండటంతో తాళాలు వేసిన ఇళ్లు లక్ష్యంగా చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్ళితే.. స్థాని క రావ్‌అండ్‌నాయుడు కళాశాలలో దొంగలు చోరీకి ప్రయత్నించగా అక్కడ వారికి ఏమీ దొరకలేదు. అనంతరం రామ్‌నగర్‌ 8 లైన్‌లో ఆ లూరి నర్సింగ్‌ కాలేజీలో ప్రిన్సిపాల్‌ గది పగులకొట్టి బీరువ పెకలించి సుమారు రూ.లక్ష నగదు అపహరించారు. అదేవిధంగా హౌసింగ్‌ బోర్డు కాలనీలో పాలిటెక్నిక్‌ హాస్టల్‌కు ఎదురుగా ఉన్న పద్మనాభుని వెంకట్‌మోహన్‌ ఇంట్లో తాళం పగల కొట్టి సొత్తు చోరీ చేశారు. పేర్న మిట్టలో ఇందిరాకాలనీలో డ్రైవర్‌గా పనిచేసే కె.అశోక్‌కుమార్‌ ఇంటి తాళం పగలగొట్టి బీరువా పెకలించి 25 గ్రాముల బంగారం, వెండివ స్తువులు తస్కరించారు. ఈ మేరకు తాలుకా పోలీసులు కేసు నమోదు చేసారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com