ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆలయాన్ని కూల్చివేసిన గుర్తుతెలియని దుండగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 18, 2024, 05:10 PM

కడప జిల్లా, ములకలచెరువు పరిధిలోని కనుగొండ అటవీ ప్రాంతంలోని అభయాంజనేయస్వామి ఆలయాన్ని కూల్చివేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని టీఎస్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీడీపీ నేత కట్టా దొర స్వామినాయుడు, మండల టీడీపీ అధ్యక్షుడు పాలగిరి సిద్ధా పేర్కొ న్నారు. కనుగొండలో కూలిపోయిన ఆలయాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తుల మనోభావాలను దెబ్బతిసే వి ధంగా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దారుణమన్నారు. బాధితులు ఎంతటివారైనా వదలిపెట్టమన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్‌గా తీసుకుని నిందితులకు శిక్షపడేలా పోలీస్‌శాఖకు ఆదేశాలు జారీ చేశార న్నారు. వారి వెంట నేతలు తోట గిరిధర్‌, చెన్నకిష్టా, కేశవులు, మండల ప్రధాన కార్యదర్శి వెంకట స్వామి, నాయ కులు ఆదినారాయణ, గొడ్డుమూరు రవి, నారాయణ, నాగేంద్ర, సోమశేఖర్‌, ఉమా శంకర్‌, శివన్న, శంకర, సూరి, నారాయణస్వామి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com