ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి ఒకరికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2024, 10:37 PM

పిల్లల చదువు కోసం పట్టణానికి వచ్చారు. వారి ఉన్నతిని చూసి పొంగిపోయారు. ఇంతలో వారి ఆశలు ఆవిరయ్యాయి. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శ్రీకాళహస్తికి చెందిన హరితారెడ్డి(27), శివ(30), మృతిచెందగా.. సాయితేజారెడ్డి (31) తీవ్రంగా గాయపడ్డారు. అలాగే ఓజిలికి చెందిన వీరి మిత్రుడు గోపి (30) కూడా అసువులు బాశారు. తొట్టంబేడు మండలం చిట్టత్తూరుకు చెందిన ఉపాధ్యాయుడు డేగపూడి భాస్కర్‌రెడ్డి, లత దంపతులు శ్రీకాళహస్తి పట్టణం బంగారమ్మకాలనీలో స్థిరపడ్డారు.


వీరికి హరితరెడ్డి(27), తేజ కుమార్తెలు. కేవీబీపురం మండలం ఆదరం గ్రామానికి చెందిన రైతు చెన్ను బ్రహ్మానందరెడ్డి, సుగుణమ్మ దంపతులూ బంగారమ్మ కాలనీలోనే ఉంటున్నారు. వీరికి కుమార్తెతో పాటు కుమారుడు చెన్ను సాయితేజారెడ్డి(31) ఉన్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉండటంతో 2022 ఫిబ్రవరి 11న సాయితేజారెడ్డి, హరితారెడ్డికి వివాహమైంది. భార్యతో కలిసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన సాయితేజారెడ్డి అమెరికాలోని టెక్సా్‌సలో స్థిరపడ్డారు. హరితారెడ్డి చెల్లెలి వివాహం కోసం ఆరునెలల క్రితం వచ్చి వెళ్లారు. మరో ఏడాదిలో ఉద్యోగానికి స్వస్తి చెప్పి శ్రీకాళహస్తిలోనే స్థిరపడాలని భావించేవారు. వీరిలాగే తొట్టంబేడు మండలం చిన్నకనపర్తి గ్రామానికి చెందిన న్యాయవాది రాజినేని రమే్‌షబాబు, శివకుమారి దంపతులు తమ పిల్లల కోసం శ్రీకాళహస్తిలోని దక్షిణ కైలాసనగర్‌కు వచ్చి స్థిరపడ్డారు. వీరికి శివ(30), లోకేష్‌ కుమారులు. శివ రెండేళ్ల కిందట బీటెక్‌ పూర్తిచేసి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం పొందారు. చిన్నకుమారుడు లోకే్‌షకు విశాఖలో మెడిసిన్‌ సీటు రావడంతో రమేష్‌ నాయుడు దంపతులు వైజాగ్‌కు నివాసం మార్చారు. అమెరికాలో ఒకేచోట పనిచేస్తున్న సాయితేజరెడ్డి, శివకు ఓజిలి మండలం రాజుపాళేనికి చెందిన తిరుమూరు గోపి కూడా మిత్రులయ్యారు. ఒకే ప్రాంతానికి చెందిన వీరంతా సెలవురోజుల్లో కలిసి సంతోషంగా గడిపేవారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయితేజరెడ్డి, హరితారెడ్డి దంపతులతో పాటు శివ, గోపి కారులో విహారానికి వెళ్లారు.


అమెరికా కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6.45 గంటలకు తిరుగు ప్రయాణంలో.. దక్షిణ బాన్‌హోంకు ఆరుమైళ్ల దూరంలో వస్తుండగా వీరి కారు, మారో కారు ఢీకొన్నాయి. అవతలి కారులో ఉన్నఇద్దరు భారతీయ మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి కారులో మంటలు వ్యాపించడంతో హరితారెడ్డి, శివ, గోపి అక్కడిక్కడక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన సాయితేజారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాద సమాచారంతో మృతుల కుటుంబాలు తల్లడిల్లాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయితేజారెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని తానా సభ్యులకు ఫోను చేసి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి కోరారు. మృతదేహాలను సకాలంలో స్వగ్రామాలకు తరలించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com