ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవంబరు 1 నుంచి రోడ్ల మరమ్మతులు ప్రారంభిస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2024, 10:36 PM

వ్యక్తిగత అవసరాలకు వాగులు, వంకల్లోని ఇసుకను ఉచితంగా తవ్వుకొని తీసుకువెళ్లడానికి అనుమతించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరిగింది. సీఎం మాట్లాడుతూ, ‘ఇసుకను ఉచితంగా ఇస్తామని వాగ్దానం చేశాం. రాష్ట్రంలో అనేకచోట్ల వాగులు, వంకలు ఉన్నాయి. వాటిలో ఎక్కడైనా, ఎవరైనా తమ సొంత అవసరాల కోసం ఉచితంగా ఇసుకను తవ్వుకొ ని తీసుకువెళ్లవచ్చు. ఎడ్ల బళ్లు, ట్రాక్టర్లతో రవాణా చేసుకోవచ్చు. వాటిని ఎవరూ ఆపరు. దానికి ఏ అనుమతి అక్కర్లేదు. ఎవరికీ పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. పెద్ద నదుల విషయంలో మాత్రం నిబంధనలు పాటిస్తాం. లారీలకు టన్నుల పరిమితి లేదు. వాటి సామర్థ్యాన్ని బట్టి అనుమతి ఇస్తాం. ఇకపై ఇసుక తక్కువ ధరకు లభించాలి. పది రోజుల్లో ఈ తేడా కనిపించాలి. ఎవరైనా ఇసుకను బ్లాక్‌ చేసి అధిక ధరలకు అమ్మితే ఊరుకొనేది లేదు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానం కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు.


వాగులు, వంక ల నుంచి ప్రజలు ట్రాక్టర్లలో ఇసుక తీసుకువెళ్తుంటే పోలీసులు ఆపి, జరిమానా విధిస్తున్నారని మంత్రి డీవీబీ స్వామి ఫిర్యాదు చేశారు. నదుల్లో ఇసుక లోడింగ్‌కు కొంతమంది బాగా తక్కువ ధరకు టెండర్లు వేశారన్న ఫిర్యాదులపై కూడా చర్చించారు. ఇలాంటి వారివద్ద డిపాజిట్‌ భారీగా తీసుకోవాలని, చేయలేకపోతే ఆ డిపాజిట్‌ను జప్తు చేయాలని సీఎం సూచించారు. ఏ ఊళ్లో ఇసుకను ఆ ఊరివాళ్లే తీసుకోవాలన్న నిబంధన లేదన్నారు. ఏవైౖనా సమస్యలుంటే మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతు పనులు నవంబరు 1 నుంచి ప్రారంభించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. దీనికోసం మరో రూ.300కోట్లు అదనంగా కేటాయిస్తూ సీఎం నిర్ణయం తీసుకొన్నారు. పల్లె పండుగ తరహాలోనే రోడ్ల మరమ్మతు పనుల ప్రారంభాన్ని కూడా రాష్ట్రమంతా ఒక వేడుకలా నిర్వహించాలన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారి గృహాలకు సౌర విద్యుత్‌ పరికరాలను ఉచితంగా బిగించాల ని నిర్ణయించారు. గ్రామాల్లో ఇళ్లకు ఈ పరికరాలు బిగించుకొనేలా ప్రోత్సహించి మిగులు కరెంటును వీధి లైట్లకు వాడుకొనే అవకాశం కల్పించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యా ణ్‌ సూచించారు. దీనికి సీఎం అంగీకరించారు. కాగా, పేదల జీవితాల్లో వెలుగు నింపేలా ఉద్యోగ, ఉపాధి కల్పన అవకాశాలను విస్తరించడానికి అనువైన పాలసీలను ఖరారు చేయడంపై చంద్రబాబు కృషిని అభినందిస్తూ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ పాలసీల ఆమోదానికి 40, 50 గంటలు కూర్చోవాల్సి వచ్చిందని సీఎం చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com