ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో కూడా సీపీఎం బస్సు యాత్ర కొనసాగుతోంది. కళ్యాణదుర్గం పట్టణంలోకి బుధవారం బస్సు యాత్ర చేరుకుంది. పట్టణంలోని టీ సర్కిల్ లో సీపీఎం నాయకులు మాట్లాడుతూ. తాగు, సాగునీరు రైతులకు ప్రభుత్వం ప్రతి ఏడాది అందించాలని కోరారు. సకాలంలో సాగునీరు అందక చాలా మంది రైతులు తమ పంటలను కోల్పోతున్నారన్నారు. తాగు, సాగునీరు ఇచ్చినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.