ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారన్న భానుప్రకాశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 08, 2024, 02:41 PM

ఐదేళ్ల పాలనలో జగన్ స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారని ఏపీ బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. అక్రమాలు ఎలా చేయాలి... అవినీతి డబ్బు ఎలా సంపాదించాలి అనే విషయంలో దేశానికే రోల్ మోడల్ గా జగన్ నిలుస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను జగన్ నాశనం చేసిన తీరుపై రామ్ గోపాల్ వర్మ సినిమా తీయాలని సూచించారు. చంద్రబాబు గాల్లో తిరిగే ముఖ్యమంత్రి కాదని భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. హామీలు నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వంపై జగన్ అబద్ధపు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ మతిస్థిమితం కోల్పోయినట్టున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా... ఒక మంచి సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవడంతో జగన్ కోర్టులను ఆశ్రయించారని ఎద్దేవా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com