ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో వాళ్లందరికి అకౌంట్‌లలో డబ్బులు జమ.. పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 07:40 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ (గ్రామీణ నీటి సరఫరా) విభాగంలో ఇంటర్నల్‌ వాటర్‌ క్వాలిటీ మానిటరింగ్‌ లేబొరేటరీల్లో పనిచేసే ఒప్పంద ఉద్యోగులకు పెండింగ్‌ జీతాలు చెల్లింపుపై స్పందించారు. ఈ మేరకు తాను అధికారులకు ఆదేశాలిస్తానని హామీ ఇచ్చారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఉద్యోగులు మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో కలిసి వినతిపత్రం ఇచ్చారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని.. మూడు నెలలుగా జీతాలివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


కడప జిల్లా కమలాపురం ల్యాబ్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్న తనను మూడు నెలల క్రితం విధుల నుంచి తొలగించారని జి.సుజన అనే వ్యాంగురాలు పవన్ కళ్యాణ్‌కు చెప్పారు. తనకు పుట్టుకతోనే ఒక కిడ్నీ లేదని, బరువులు ఎత్తే పనులు చేయలేనన్నారు. ఏ ఆధారం లేని తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని సుజన డిప్యూటీ సీఎంను కోరారు. విషయం గురించి అధికారులతో మాట్లాడతానని పవన్ కళ్యాణ్‌ ఆమెకు ధైర్యం చెప్పారు.


మరోవైపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ప్లాంట్‌లో ప్రస్తుతం 12,500 మంది ఉద్యోగులతోపాటు 14 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని ఉద్యోగులు వివరించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సైతం ఆపాలని పవన్‌ను వారు కోరారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ‌కరణ విషయంలో కార్మిక సంఘాల ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తానన్నారు పవన్ కళ్యాణ్. విశాఖ ఉక్కు కోసం చేసిన త్యాగాలు మరచిపోవద్దని..32 మంది బలిదానాలు, 16 వేల మంది నిర్వాసితుల త్యాగాల ఫలితమన్నారు.


పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం కార్మికులు, ఉద్యోగులు, వారి సంఘాల్లో ఉండాలి అన్నారు. ఉద్యోగులు, కార్మికులు, భూ నిర్వాసితులు ప్రతిపాదనలు.. కేంద్ర ప్రభుత్వానికి తెలియచేస్తాను అన్నారు. 24 వేల ఎకరాలు భూ సేకరణతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేశారని.. ప్రభుత్వ రంగ సంస్థలు బతకాలని తాను కోరుకుంటానని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనే ప్రతిపాదన రాగానే తానే కేంద్రం దగ్గకు వెళ్లి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలిసి పలువురు త్యాగాలు, పోరాటాలతో ఈ పరిశ్రమ ఏర్పాటైందని వివరించాను అన్నారు.


గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర సభ నిర్వహించి ఉద్యోగ, కార్మిక సంఘాలు అన్నీ ఒక తాటిపైకి వచ్చి అఖిల పక్షంతో కేంద్రం వద్దకు వెళ్ళి.. వినతి పత్రం ఇద్దామని చెబితే ఎవరూ ముందుకు రాలేదన్నారు పవన్. ఆ రోజే అందరూ కలసి వచ్చి ఉంటే ఇప్పుడు ఇంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండేదికాదన్నారు. ప్లాంట్ కార్మికులు, ఉద్యోగుల ఆందోళనను కేంద్ర ప్రభుత్వానికి తెలియచేస్తానని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com