ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ పుంగనూరు పర్యటన రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 05:28 PM

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుంగనూరు పర్యటన రద్దు అయ్యింది. పుంగనూరులో చిన్నారిని కిడ్నాప్ చేసి ఆపై దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హత్యకు గురైన చిన్నారి అస్పియా కుటుంబసభ్యులను పరామర్శించేందుకు ఈనెల 9న జగన్ పుంగనూరుకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే జగన్‌ పుంగనూరు పర్యటనను రద్దు చేసుకున్నట్లు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. చిన్నారి హత్య విషయంలో నేరస్తులను ప్రభుత్వం అరెస్ట్ చేసినందున జగన్ పర్యటన రద్దు చేసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి రామాచంద్రారెడ్డి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com