ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెన్నైలో దారుణమైన తొక్కిసలాట..అస్వస్థతకు గురైన ఐదుగురు మృతి

national |  Suryaa Desk  | Published : Mon, Oct 07, 2024, 11:53 AM

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద ఆదివారం నిర్వహించిన ఎయిర్ షో సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. ఎయిర్‌ షోను వీక్షించేందుకు వచ్చినవారిలో పలువురు ఎండతీవ్రత ఎక్కువగా ఉండటంతో సొమ్మసిల్లి పడిపోయారు.అయితే ఇలా అస్వస్థతకు గురైన ఐదుగురు మరణించారు. హీట్ వేవ్‌తో పదుల సంఖ్యలో జనాలు స్పృహ కోల్పోగా.. వారికి ఆస్పత్రులలో చికిత్స కొనసాగిస్తున్నారు. వివరాలు.. చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ ఆదివారం (అక్టోబర్ 6) రోజున మెగా ఎయిర్‌ షో నిర్వహించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 92వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.అయితే ఉదయం 11 గంటలకు ఎయిర్ షో ప్రారంభం అయింది. అయితే ఈ షోను వీక్షించేందుకు లక్షలాది మంది ప్రజలు మెరీనా బీచ్‌కు తరలివచ్చారు. ఉదయం 8 గంటల నుంచే పెద్ద ఎత్తున జనాలు రావడంతో మెరీనా బీచ్‌లో ఎటు చూసినా జనసందోహమే కనిపించింది. తీరం వెంబడి కొన్ని కిలోమీటర్ల మేర జనాలు బారులు తీరారు. అయితే ఎండ తీవ్రత ఎక్కువ, ఊహించిన దానికంటే పెద్ద సంఖ్యలో జనాలు తరలిరావడంతో పరిస్థితి చేజారిపోయింది.


 


మరోవైపు ఎయిర్ షో ముగిసిన తర్వాత తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు జనాలు ట్రాఫిక్ నిబంధనలను కూడా ఉల్లంఘించారు. దీంతో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో కొన్ని గంటల పాటు ఎవరూ ఎక్కడికి కదలలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు సరైన తాగునీటి వసతి లేకపోవడం, ఎండ తీవ్రత, తొక్కిసలాటతో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. ఎండ తీవ్రత, ఉక్కపోతతో కొందరు ఓపికలేక అక్కడే కూర్చుండిపోయారు. అయితే ఇలాంటివారికి అక్కడికి సమీపంలోని వారు తాగునీరు అందించడంతో కొంత పరిస్థితి చక్కబడింది.ఇక, పలువురు ట్రాఫిక్ రద్దీని తప్పించుకోవడానికి సబర్బన్, మెట్రో రైళ్లను ఆశ్రయించగా.. అక్కడ కూడా ప్రయాణికులతో స్టేషన్లు కిక్కిరిసి కనిపించాయి. ఈ క్రమంలోనే తోపులాటలు కూడా చోటుచేసుకున్నాయి.


అయితే మెరీనా బీచ్‌లో ఎండతీవ్రతతో సొమ్మసిల్లి పడిపోయినవారిలో ఐదుగురు మరణించారు. మొత్తంగా కనీసం 96 మంది ఆసుపత్రి పాలయ్యారని తెలుస్తోంది. ఇక, ఎయిర్ ఫోర్స్ వైమానిక ప్రదర్శన మధ్యాహ్నం 1 గంటలకు ముగిసిందని.. అయితే అప్పటి నుంచి దాదాపు మూడు గంటల తర్వాత మెరీనా బీచ్ దగ్గర ట్రాఫిక్ పునరుద్ధరించబడిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.అయితే దాదాపు 13 లక్షల మంది వరకు ఈ ఎయిర్ షోను వీక్షించేందుకు వచ్చినట్టుగా చెబుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుతో పాటు చాలా మంది తమతమ వాహనాల్లో వచ్చారు. దీంతో ఎయిర్ షో ప్రారంభానికి ముందే పలు మార్గాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడిది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com