ట్రెండింగ్
Epaper    English    தமிழ்

14వ సారి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 08:27 PM

నేటి నుంచి శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో, ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల చేరుకున్నారు. తిరుమల కొండపై పద్మావతి అతిథి గృహం వద్ద చంద్రబాబుకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం, సీఎం చంద్రబాబు సతీసమేతంగా వెంకన్నస్వామికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా, చంద్రబాబు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద శేష వాహన సేవలోనూ పాల్గొననున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com