రాష్ట్రంలో రైల్వే సమస్యలు వేగంగా పరిష్కరించాలని జీఎంను కోరగా సానుకూలంగా స్పందించారని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ అన్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరామని తెలిపారు. విజయవాడ - బెంగళూరు మధ్య తిరిగే కొండవీడు ఎక్స్ ప్రెస్ను రోజూ నడపాలని కోరామన్నారు. అలాగే బెంగళూరు - పుట్టపర్తికి నడిచే ఎక్స్ప్రెస్ను అనంతపురంకు పొడిగించాలని కోరామన్నారు. ప్రయాణికుల దృష్ట్యా ప్యాసింజర్ రైళ్లను పెంచాలని కోరామని, రైళ్లలో వృద్దులకు రాయితీ పునరుద్ధరించాలని కోరినట్లు ఎంపీ అంబికా లక్ష్మి నారాయణ వెల్లడించారు.