ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైకోర్టులో సజ్జలకి ఊరట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 06:24 PM

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 25వ తేదీ వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఘటన జరిగిన రోజున సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నారని.. ఈ కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఉందని పోలీసుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు.


ఆయన ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్ధ్ లూథ్రా తెలిపారు. అయితే ఘటన జరిగిన రోజు సజ్జల 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని సజ్జల తరపున న్యాయవాదులు న్యాయస్థానానికి తెలియజేశారు. ఆ రోజున పోరుమామిళ్లల్లో ఉన్నారని, అక్కడ మీడియాలో వచ్చిన క్లిప్పింగ్‌లను కోర్టుకు చూపించారు. ఈ క్రమంలో తాము ఈ కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను మరోసారి పరిశీలిస్తామని సిద్దార్థ లూథ్రా చెప్పారు. దీంతో కేసు విచారణ హైకోర్టు ఈనెల 25కు వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com