ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధాన్యం కొనుగోళ్లలో నూతన మార్గదర్శకాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 08:47 PM

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం సేకరణకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ నెల మొదటి వారం నుంచి వరి కోతలు, ఽనూర్పిళ్లు, ధాన్యం అమ్మకాలు ఊపందుకోనున్న నేపథ్యంలో 2024-25 ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించుకోవడానికి ఎన్నో పాట్లు పడ్డారు. ఆ కష్టాలకు చెల్లుచీటీ ఇస్తూ.. ఇప్పుడు మెరుగైన విధానంలో ధాన్యం సేకరణకు చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం ఆదేశించడంతో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌, కమిషనర్‌ జి.వీరపాండియన్‌, వైస్‌ చైర్మన్‌, మనజీర్‌ జిలానీ సమూన్‌లు ప్రత్యేక దృష్టి సారించారు.


ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడంతోపాటు, 48 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేసేందుకు అవసరమైన నిధులను ముందుగానే సమకూర్చుకునేందుకు కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజాపంపిణీ అవసరాలు, ఇతర సంక్షేమ పథకాలకు 45 లక్షల టన్నుల ధాన్యం అవసరం కాగా.. ఈ ఖరీ్‌ఫలో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరణను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి రైతు సేవా కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వికేంద్రీకరణ విధానంలో ధాన్యం సేకరించనున్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నమోదు చేసిన ఈ-పంట, ఈకేవైసీ డేటా ఆధారంగా ధాన్యం కొనుగోలు చేయనున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, ఏపీ మార్క్‌ఫెడ్‌లు నోడల్‌ ఏజెన్సీలుగా వ్యవహరించనున్నాయి. ఽజిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్‌ మిల్లింగ్‌ కార్యకలాపాలను కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు పర్యవేక్షించాలని ప్రభుత్వం నిర్దేశించింది. కేంద్రం నిర్దేశించిన కనీస మద్దతు ధర ప్రకారం కామన్‌ రకం ధాన్యం క్వింటాలుకు రూ.2,300 లు, గ్రేడ్‌-ఎ రకానికి రూ.2,320 చొప్పున చెల్లించాలని ప్రభుత్వ మార్గదర్శకాల్లో పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com