ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాలిబాటన తిరుమల స్వామివారిని దర్శించుకున్న పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 02, 2024, 08:44 PM

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్... దీక్ష విరమణ కోసం తిరుమలకు వచ్చారు.


నిన్న కాలిబాటన తిరుమలకు వచ్చిన ఉపముఖ్యమంత్రి ఈరోజు (బుధవారం) ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. తన ఇద్దరు కుమార్తెలతో కలిసి మహాద్వారం గుండా ఆలయంలోకి పవన్ ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం తన ఇద్దరు కుమార్తెలతో కలిసి పవన్ శ్రీవారిని దర్శించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com