ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ తన తండ్రి బాటలో నడుస్తున్నాడని బండి సంజయ్ విమర్శలు

international |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 04:35 PM

తిరుమల డిక్లరేషన్‌పై మాట్లాడుతున్న ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు మక్కా, వాటికన్ నిబంధనలపై మాట్లాడే దమ్ముందా? అని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ నిలదీశారు. ఈరోజు బండ్లగూడ జాగీర్‌లో విద్యారణ్య భవన ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎవరి మత సాంప్రదాయానికి సంబంధించి వారికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయన్నారు. హిందువులపై, తిరుమల డిక్లరేషన్‌పై మాట్లాడిన జగన్ మరింత అపవాదును మూటగట్టుకున్నారని విమర్శించారు. జగన్ డిక్లరేషన్ ఇస్తే తప్పేమిటని ప్రశ్నించారు.వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దళితులకు ఆలయ ప్రవేశం కల్పించలేదని, అదే ఇప్పుడు జగన్ ఫాలో అవుతున్నారని విమర్శించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com