ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కీర దోసను డైలీ తినడం వల్ల డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 03:51 PM

ప్రస్తుత కాలంలో ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి.. ఇలాంటి తరుణంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మంచి జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం..అలాంటి మంచి ఆహారంలో కీర దోసకాయ ఒకటి.. ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహారం.. కీర దోసను డైలీ తినడం వల్ల డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందడమే కాకుండా మన మెదడు బలాన్ని పెంచడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హెల్తీ ఫుడ్స్ విషయానికి వస్తే.. దోసకాయ చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిని సలాడ్ గా లేదా.. జ్యూస్ గా తీసుకోవచ్చు.. విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఇందులో లభిస్తాయి. అయితే, కీర దోసకాయలోని ఫిసెటిన్.. ఒక సహజమైన ఫ్లేవనాయిడ్.. ఇది జ్ఞానాన్ని పెంచడంతోపాటు.. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కీర దోసకాయను రెగ్యులర్ గా తినేవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి..


 జ్ఞాపకశక్తి బలపడుతుంది: దోసకాయ మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. మానసిక ఆరోగ్యానికి కూడా మంచిదని భావిస్తారు. దోసకాయలో ఫిసెటిన్ అనే మూలకం ఉంది. ఇది మీ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మతిమరుపుతో బాధపడేవారు దోసకాయను తప్పనిసరిగా తినాలి. ఇది మీ మనస్సుకు పదును పెట్టడంతోపాటు పాత విషయాలను కూడా గుర్తుంచుకునేలా చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. .


శరీరం నుండి టాక్సిన్స్ తొలగిపోతాయి: దోసకాయ శరీరంలోని విషపూరితమైన అంశాలను తొలగిస్తుంది. ఇందులో 95 శాతం నీరు ఉంటుంది. దీని సహాయంతో శరీరం నుండి టాక్సిన్స్ బయటకు వస్తాయి.జీర్ణక్రియ మెరుగుపడుతుంది: దోసకాయలో ఉండే ఫైబర్ ఎలిమెంట్స్ జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడతాయి. దీన్ని తినడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.


క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: దోసకాయలో లిగ్నాన్స్, పాలీఫెనాల్స్ ఉన్నాయి. ఇవి అండాశయాలు, గర్భాశయం, రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇది కుకుర్బిటాసిన్లను కలిగి ఉంటుంది. ఇవి క్యాన్సర్ నిరోధక మూలకాలుగా పరిగణిస్తారు.


 శరీరాన్ని చల్లగా ఉంచుతుంది: దోసకాయ తినడం వల్ల.. పగటి పూట కానీ.. ఎప్పుడైనా చాలాసేపు నీరు తాగడం మరచిపోతే శరీరంలోని నీటి కొరతను తీరుస్తుంది. ఇది హీట్ బర్న్, స్కిన్ అలర్జీలు, సన్ బర్న్ నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ సమస్యలు ఉన్నప్పుడు దోసకాయను తినడం చాలా మంచిది.కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది: దోసకాయ తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోయి శరీర వ్యవస్థ సాఫీగా సాగుతుంది. దోసకాయ రసం తాగడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com