ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళనాడులోని రసాయన గోదాములో ప్రమాదం

national |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 11:54 AM

తమిళనాడులోని రసాయన గోదాములో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణగిరి జిల్లా ఉద్దానపల్లిలోని టాటా కంపెనీకి చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఈపీఎల్)లో శనివారం తెల్లవారుజామున మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ పెయింటింగ్ యూనిట్‌లోని రసాయన గోదాములో ఉదయం 5.30 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.


దీంతో అత్రమత్తమైన సిబ్బంది గోదాములో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. భారీగా మంటలు రేగడంతో వాటిని అదుపు చేసేందుకు ఏడు ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.ఈ కంపెనీలో TEPL సంస్థ ఐఫోన్లలో వాడే వివిధ ఉపకరణాలను ఉత్పత్తి చేస్తోంది. సుమారు 4,500 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రాత్రిపూట విధుల్లో ఉన్న ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. వారు వెంటనే అప్రమత్తమవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు పేర్కొన్నారు.పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో కొందరు ఉద్యోగులు శ్వాస సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొన్నారని, వారిని ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ప్రభావిత ప్రాంతంలో 100 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించినట్లుగా ఎస్పీ తంగదురై వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com