ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 28న ‘మన ఇళ్లు.. మన గౌరవం’ కార్య క్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2024, 11:51 AM

పార్వతీపురం జిల్లాలో ఈ నెల 28న ‘మన ఇళ్లు.. మన గౌరవం’ కార్య క్రమం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో ఆయన సమీక్షించారు. ‘మన ఇళ్లు.. మన గౌరవం’ కిందట ఇప్పటికే ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులోగా నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. 


ఒకవేళ పూర్తిచేయకపోతే రద్దవుతాయని చెప్పారు. యూనిట్‌ ధర రూ.1.80 లక్షలతో పాటు స్వయం సహాయక సభ్యులకు రూ.30 వేలు రుణం లభిస్తుందన్నారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడానికి మండల ప్రత్యేక అధికారులు మంగళ, బుధవారాల్లో మండలాల్లో పర్యటించాలని ఆదేశించారు. 28న లబ్ధిదారులతో అవగాహన సమావేశాలు నిర్వహించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com