ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2024, 07:11 PM

శ్రీకాకుళం జిల్లా, గార మండలం, అంపోలు గ్రామానికి చెందిన కోరుపోలు రమణ(38) అనే వ్యక్తి పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రమణ మద్యానికి బానిస కావడంతోపాటు తరచూ వళ్లు నొప్పులు ఉన్నాయంటూ చె పుతుండేవాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం పురుగులు మందు తాగి ఇంటికి వచ్చిన రమణ.. తన భార్య సంతోషికి ఈ విషయం చెప్పడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చనిపోయాడు. కాగా రమణకు ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. సంతోషి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ జనార్దనరావు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com