ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీం ఆదేశాలతో మమత నాటకానికి తెర

national |  Suryaa Desk  | Published : Tue, Feb 05, 2019, 06:37 PM

సుప్రీంకోర్టు తీర్పు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సర్కార్‌కు చెంపపెట్టని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీం ఆదేశాలతో మమత నాటకానికి తెరపడిందన్నారు. మమతాబెనర్జీకి ఏదో ఊరట కలిగించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు బిల్డప్‌ ఇస్తున్నారని ఆయన విమర్శించారు. పార్లమెంట్‌ సభ్యులకు అసెంబ్లీ స్పీకర్‌ నోటీసులు ఇవ్వలేరని జీవీఎల్‌ అన్నారు. సీఎం బెదిరింపులకు నోటీసులు ఇస్తామన్న భయంతోనే...తనపై నోటీసు పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని జీవీఎల్‌ అన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com