ఏపీకి చెందిన ప్రముఖ విద్యావేత్త కేవీ విష్ణు రాజు ఈ రోజు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విష్ణురాజుకు పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేన లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, భీమవరంలోని డాక్టరు బీవీ రాజు ఫౌండేషన్ చైర్మన్ అయిన విష్ణురాజుని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని అన్నారు. ఆయన తమ కళాశాలను నడిపే విధానం తనను అమితంగా ఆకట్టుకుందని అన్నారు. పాలసీ మేకింగ్, పార్టీకి దిశానిర్దేశం విషయంలో గానీ తన పాత్ర ఉంటుందని విష్ణు రాజు చెప్పడంతో పార్టీలోకి ఆహ్వానించానని చెప్పారు. జనసేన పార్టీ అడ్వయిజరీ కౌన్సిల్ చైర్మన్ గా విష్ణురాజుని నియమిస్తున్నట్టు ప్రకటించారు.
Sri KV Vishnu Raju appointed as JanaSena Party Advisory Chairman
Full album : https://t.co/haGW0tquwv
Video : https://t.co/xQhEgVCrqE pic.twitter.com/uYzLxoHHE6
— JanaSena Party (@JanaSenaParty) February 5, 2019