ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ను నిందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2024, 12:45 PM

రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దాన్ని కప్పి పుచ్చుకోవడానికే సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ముందస్తు జాగ్రత్తల్లోనే కాకుండా, సహాయక చర్యల్లో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన స్పష్టం చేశారు. ఎంతసేపూ గత ప్రభుత్వాన్ని, జగన్‌ను నిందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని, తమ పార్టీ నేతలను టార్గెట్‌ చేసి కేసులతో వేధించడం సీఎం చంద్రబాబు దినచర్యగా మారిందని దుయ్యబట్టారు. బుడమేరుకు సరిగ్గా 60 ఏళ్ళ క్రితమే వరద వచ్చి అప్పట్లోనే పది మంది మరణించిన విషయాన్ని ప్రస్తావించిన కాకాణి, ఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com