ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమాచారం ఉన్నా, ప్రజలను ఎందుకు అప్రమత్తం చెయ్యలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 10, 2024, 12:44 PM

విజయవాడను ముంచెత్తిన వరదల్లో చనిపోయిన వారివి  ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తబోతోందని ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం ఉన్నా, ప్రజలను అప్రమత్తం చేయలేదని, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని, మరోవైపు వరద బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆయన ఆక్షేపించారు. విజయవాడ వరదలు ఏ మాత్రం ప్రకృతి వైపరీత్యం కాదన్న మాజీ మంత్రి, అది ప్రభుత్వం సృష్టించిన వైపరీత్యం అని, సీఎం పబ్లిసిటీ యావకు పరాకాష్ట అని అభివర్ణించారు. అందుకే వరద మరణాలకు సీఎం, మంత్రివర్గంతో సహా, సంబంధిత శాఖల అధికారులంతా బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com