మాఘమాసానికి ముందు వచ్చే సోమవారం, అమావాస్య కావడంతో... ఇవాళ హరిద్వార్ కుంభమేళాకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గంగలో పవిత్ర స్నానాలు చేశారు. ముక్కంటి పూజిస్తూ... అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. జనవరి 15న ప్రారంభమైన కుంభమేళా... మార్చి 4 వరకు 49 రోజుల పాటు జరగబోతోంది. 192 దేశాల నుంచి ఈ ఆధ్యాత్మిక వేడుకకు 12 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే కోట్ల మంది భక్తులు కుంభమేళాకు వచ్చి పవిత్ర స్నానాలు చేశారు.